Yogi Adityanath : ఉద్యోగులు అరగంటలో లంచ్ చేసి రావాలి : యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి ఐన యోగి ఆదిత్యనాథ్ విప్లవాత్మకమైన మార్పులతో ముందుకు వెళ్తున్నారు.

Update: 2022-04-13 09:15 GMT

Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి ఐన యోగి ఆదిత్యనాథ్ విప్లవాత్మకమైన మార్పులతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల భోజన సమయాన్ని అరగంటకు మించకూడదని సూచించారు. ఉద్యోగులు ఎక్కువసేపు భోజన విరామం తీసుకుంటున్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనివలన పనులు ఆలస్యం అవుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటివరుకు ఉద్యోగులు 1.30PM లంచ్‌కు వెళ్లి 3.30PM  లేదా 4 గంటలకు వచ్చేవారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పనులు పూర్తి చేసుకునేందుకు వెళ్లి ఫిర్యాదులతో వచ్చిన సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Tags:    

Similar News