లాటరీలో రూ.25కోట్లు గెలుచుకున్న వార్త తెలిసి ఆమె..

సరదాగా లాటరీ టికెట్ కొన్నది ఆస్ట్రేలియాకు చెందిన 20 ఏళ్ల విశ్వవిద్యాలయ విద్యార్థి. ఆ తరువాత యథాలాపంగా తనపనులేవో

Update: 2020-08-26 10:18 GMT

సరదాగా లాటరీ టికెట్ కొన్నది ఆస్ట్రేలియాకు చెందిన 20 ఏళ్ల విశ్వవిద్యాలయ విద్యార్థి. ఆ తరువాత యథాలాపంగా తనపనులేవో తాను చేసుకుంటోంది. ఓ రోజు ఆన్ లైన్ తరగతులు వింటుండగా.. ఫోన్ కి మెసేజ్ వచ్చింది లాటరీ తగిలిందని.. రూ.25 కోట్లు గెలుచుకున్నారని.. అయినా ఏమాత్రం తొణకకుండా పాఠం వినడం పూర్తయిన తరువాత తన అదృష్టానికి తనే ఆశ్చర్యపోయింది. సెట్ ఫర్ లైఫ్ లాటరీని గెలుచుకున్న ఆమె ఈ డబ్బుతో ఏం చేస్తావని అడిగితే తన తల్లికి ఓ ఇల్లు, తనకి ఓ ఇల్లు కొనుక్కుంటానంది. ఆస్ట్రేలియాతో పాటు మరిన్ని దేశాలు చుట్టి వస్తానని తెలిపింది. 

Tags:    

Similar News