255వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఉద్యమం
అమరావతి రైతుల నిరసనలు 255వ రోజుకు చేరాయి. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ;
అమరావతి రైతుల నిరసనలు 255వ రోజుకు చేరాయి. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ రాజధాని రైతులు, మహిళలు నినాదాలు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, పెదపరిమి, వెంకటపాలెం, బోరుపాలెం, అబ్బురాజు పాలెం, ఉద్దండరాయుని పాలెం గ్రామాల్లోని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి.. అమరావతే రాజధానిగా కొనసాగుతుందని ప్రకటించే వరకూ ఉద్యమం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.