TS : ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదు : రేవంత్ రెడ్డి

యాత్ర ఫర్ చేంజ్ పేరుతో పాదయాత్ర చేస్తున్న ఆయన మార్గ మధ్యలో ప్రజలను కలుస్తున్నారు;

Update: 2023-03-02 07:02 GMT

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హాథ్‌ సే హాథ్‌ జోడో 18వ రోజు పాదయాత్రలో భాగంగా హుస్నాబాద్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. యాత్ర ఫర్ చేంజ్ పేరుతో పాదయాత్ర చేస్తున్న ఆయన మార్గ మధ్యలో ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ.. విమర్శలు గుప్పించారు. అలాగే తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో వివరించారు.సంపూర్ణ మార్పు కోసమే యాత్ర చేపట్టామన్నరు రేవంత్‌.

Tags:    

Similar News