ASSAM: ఇక అస్సాంలో వాటర్ ప్యాకెట్లు ఉండవ్
లీటర్ కన్నా తక్కువ ఉన్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్పై అస్సాం నిషేధం
లీటర్ కన్నా తక్కువ ఉన్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల(packaged drinking water)ను నిషేధించాలని... అస్సాం(Assam) ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2(October 2) నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అలాగే 2024 అక్టోబర్ నుంచి 2 లీటర్ల కన్నా తక్కువ ఉన్న ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లను నిషేధిస్తామని...ఆ రాష్ట్ర C.M...హిమంత బిశ్వశర్మ తెలిపారు. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో "పాలిథిలిన్-టెరాఫ్తలెట్-P.E.T"(PET of less than 1 litre in volume)తో వాటర్ బాటిళ్ల తయారీ, వినియోగాన్ని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2021 ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు అమలు చేస్తామన్న ఆయన...సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం కఠినంగా అమలు చేస్తామన్నారు.ASSAM: ఇక అస్సాంలో వాటర్ ప్యాకెట్లు ఉండవ్