Union Minister: మరో ఆరు నెలల్లో అందుబాటులో క్యాన్సర్ టీకా..!

మహిళల్లో క్యాన్సర్ రాకుండా కేంద్ర ముందస్తు చర్యలు;

Update: 2025-02-19 00:30 GMT

మహిళల్లో క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మహిళలను వేధిస్తున్న క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ అన్నారు. తొమ్మిది నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు అందిస్తామన్నారు. మంగళవారం ఛత్రపతి శంభాజీనగర్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీకాపై పరిశోధన పనులు దాదాపు పూర్తయ్యాయని, పరీక్షలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.

జాదవ్ మాట్లాడుతూ.. “దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంది. 30 ఏళ్లు పైబడిన మహిళలకు ఆసుపత్రులలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించడానికి ‘డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు’ ఏర్పాటు చేస్తాం. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే.. మహిళలను ప్రభావితం చేసే క్యాన్సర్‌ వ్యాక్సిన్‌పై పరిశోధన దాదాపు పూర్తయింది. పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇది ఐదు నుంచి ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. తొమ్మిది నుంచి 16 సంవత్సరాల వయస్సు గల బాలికలు టీకాకు అర్హులు అవుతారు. ఇది రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్‌లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.” అని తెలిపారు.

అంతేకాకుండా, దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిందని కేంద్రమంత్రి అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. 30 ఏళ్లు పైబడిన మహిళలు ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ చేయించుకుంటారని తెలిపారు. వ్యాధిని ముందస్తుగానే గుర్తించడానికి డేకేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా ప్రభుత్వం మాఫీ చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఆయుష్ కేంద్రాలుగా మార్చడంపైనా ఆయన స్పందించారు. ఆస్పత్రులలో ఆయుష్ విభాగాలు ఉన్నాయని.. ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలన్నారు. దేశంలో ఇటువంటి 12,500 ఆరోగ్య సౌకర్యాలు ఉన్నాయని.. ప్రభుత్వం వాటి సంఖ్యను పెంచుతోందన్నారు.

Tags:    

Similar News