Church Father: అయ్యప్ప దీక్ష తీసుకున్న చర్చి ఫాదర్‌..

శబరిమల సందర్శన కోసం లైసెన్స్‌ వదులుకున్న రెవరెండ్‌ మనోజ్‌;

Update: 2023-09-11 06:45 GMT

కేరళలో ఓ చర్చి ఫాదర్ అయ్యప్ప  భక్తుడిగా మారారు. ఇందుకోసం ఆయన తన ఫాదర్  లైసెన్స్‌ను కూడా వదులుకున్నారు. అంతేకాదు, స్వామి మాల ధరించి రోజు పూజలు చేస్తున్నారు. 41 రోజుల అయ్యప్ప దీక్ష తీసుకున్న ఆయన త్వరలోనే అయ్యప్పను దర్శించుకోనున్నారు. 

జీసన్ ను ఎంతగానో నమ్మే క్రైస్తవులు ఇతర దేవుళ్లను నమ్మరు. విగ్రహారాధన తప్పు అని భావిస్తారు. అటువంటి ఓ క్రైస్తవుడు అయ్యప్ప మాల ధరించారు. . 50 ఏళ్ల మనోనోజ్‌ ప్రసిద్ధ అనే ఫాదర్  శబరిమల క్షేత్ర సందర్శన కోసం రెవరెండ్‌ లైసెన్స్‌ కూడా వదులుకున్నారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన రెవరెండ్‌ మనోజ్‌ కేజీ అనే వ్యక్తి ఆంగ్లికన్ చర్చి ఆఫ్‌ ఇండియాలో  ఫాదర్‌గా ఉన్నారు. ఆ హరిహర సుతుని మీద భక్తి తో  అయ్యప్ప మాల ధరించారు. శబరిమల వచ్చి స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నారు. దీంతో మతపరమైన నియమాలు ఉల్లంఘించారని..ఫాదర్ మనోజ్ పై ఆంగ్లియన్ చర్చి ఆఫ్ ఇండియా నిషేధం విధించింది.ఆయన రెవరెండ్ గుర్తింపు కార్డును క్యాన్సిల్ చేసింది.  వివరణ ఇవ్వాలని మనోజ్‌ను చర్చ్ ఆదేశించింది. అయితే ఆయన దానికి  దీటుగా స్పందించారు. వివరణ ఇవ్వకుండా తన ఐడీ కార్డ్, ప్రీస్ట్‌హుడ్‌ తీసుకున్నప్పుడు ఇచ్చిన లైసెన్స్‌ను తిరిగి ఇచ్చేశారు. అంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇండియా సిద్ధాంతాలు, నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు అంగీకరించారు.


దేవుడు ప్రతి ఒక్కరినీ కులమత విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రేమించమన్నాడని, కాబట్టి మీరు చర్చి సిద్ధాంతాన్ని అనుసరిస్తారా? లేదంటే దేవుడి సిద్ధాంతాన్ని అనుసరించాలా  అనేది మీరే  నిర్ణయించుకోవచ్చన్నారు. తన దీక్షపై వస్తున్న విమర్శలకు మనోజ్ ఫేస్‌బుక్‌లో వీడియో ద్వారా స్పందించారు. మీరు ప్రేమించేది చర్చినా? దేవుడినా? అన్నది మీ నిర్ణయించుకోవచ్చని పేర్కొన్నారు.   ప్రీస్ట్‌హుడ్ తీసుకోవడానికి ముందు మనోజ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. మతాచారాలకు అతీతమైన హిందూయిజంపై అవగాహన పెంచుకోవడమే తన ఉద్దేశమని తెలిపారు. చర్చిలో చేరింది కూడా ఈ ఆలోచనతోనేనని స్పష్టం చేశారు. తానేమీ తప్పు చేయలేదని విశ్వసిస్తున్నానని, హిందూ మతాన్ని దాని ఆచారాలకు అతీతంగా అర్థం చేసుకోవడమే తన ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News