New Delhi: న్యాయమూర్తి నగదు వివాదం.. జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా

New Delhi: న్యాయమూర్తి నగదు వివాదం..  జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా
X
2025 మార్చి 14న లూటియన్స్ ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం భారీ మొత్తంలో ఉన్న కరెన్సీ నోట్ల కట్టలు కాలి బూడిదయ్యాయి. ఒక న్యాయమూర్తి ఇంట్లో అంత భారీ మొత్తంలో నగదు ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

గత సంవత్సరం ఢిల్లీలోని తన నివాసంలో భారీగా నగదు లభ్యం కావడంతో, తనను పదవి నుంచి తొలగించేందుకు జరుగుతున్న అభిశంసన ప్రక్రియ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. వర్మ తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు.

"ఈ లేఖను సమర్పించడానికి నన్ను ప్రేరేపించిన కారణాలతో మీ గౌరవప్రదమైన కార్యాలయానికి భారం కలిగించాలని నేను భావించడం లేదు. తీవ్రమైన ఆవేదనతో నేను అలహాబాద్‌లోని గౌరవ హైకోర్టు న్యాయమూర్తి పదవికి తక్షణమే రాజీనామా చేస్తున్నాను" అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఆయన రాజీనామా చేయడంతో, హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి ఆయనను తొలగించే అభిశంసన ప్రక్రియ ముగిసిపోతుందని లోక్‌సభ సచివాలయ వర్గాలు తెలిపాయి. 2025 మార్చి 14న లూటియన్స్ ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసం నుండి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. పనివాళ్ల క్వార్టర్ల సమీపంలోని ఒక గిడ్డంగిలో ఆ నగదును కనుగొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో జస్టిస్ వర్మ, ఆయన భార్య భోపాల్‌లో ఉన్నారు.

ఒక వారం తర్వాత, ఈ విషయంపై అంతర్గత విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మే 4న, ముగ్గురు సీనియర్ న్యాయమూర్లతో కూడిన ఒక ప్యానెల్ తన నివేదికను అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు సమర్పించింది.

అప్పుడు న్యాయస్థానం ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ వర్మ నుండి న్యాయపరమైన పనులను తొలగించింది. ఆయనను ఆయన మాతృ సంస్థ అయిన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసి, ఆయనకు ఎలాంటి న్యాయపరమైన పనులను అప్పగించవద్దని అక్కడి ప్రధాన న్యాయమూర్తిని కోరింది.

తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ స్టోర్‌రూమ్‌లో ఎప్పుడూ నగదు ఉంచలేదని న్యాయమూర్తి తెలిపారు. ఆ గది అందరికీ అందుబాటులో ఉండేదని కూడా ఆయన చెప్పారు. నిరాధార ఆరోపణలతో తీవ్ర మానసిన వేదన చెందిన తాను తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించినట్లు జస్టిస్ వర్మ తెలిపారు.

Tags

Next Story