RajyaSabha: రాజ్యసభలో తెలుగు రాష్ట్రాలే రిచ్ అట
రాజ్యసభలోఅత్యధిక ధనవంతులుగా తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఏడుగురు ఎంపీల్లో ముగ్గురు బిలియనీర్లు;
రాజ్యసభ సభ్యుల్లో అత్యధిక ధనవంతులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ, బీఆర్ఎస్ ఎంపీలున్నారు.రాజ్యసభలో ఉన్న 233మంది సభ్యుల్లో 225 మంది అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ విడుదల చేసింది.తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ బండి పార్థసారధి రెడ్డికి 5 వేల300 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి 2వేల577 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
ఇక రాజ్యసభ ఎంపీల్లో ఏపీ ఎంపీలు 45 శాతం, తెలంగాణ ఎంపీలు 43 శాతం, ఢిల్లీ ఎంపీలు 33 శాతం, పంజాబ్ ఎంపీల్లో 23 శాతం మంది బిలియనీర్లు ఉన్నారని సంస్థ వెల్లడించింది. రాజ్యసభలోని మొత్తం 225 మంది సభ్యుల్లో 12 శాతం మంది అంటే 27 మంది ఎంపీలు అపర కోటీశ్వరులున్నారు. బిలియనీర్లలో బీజేపీకి చెందినవారు ఆరుగురు ఉండగా కాంగ్రెస్ కు చెందినవారు నలుగురు, వైసీపీ ఎంపీలు నలుగురు, ఆఫ్ ఎంపీలు ముగ్గురు, బీఆర్ఎస్ ఎంపీలు ముగ్గురు, ఆర్జెడి ఎంపీలు ఇద్దరు ఉన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం చూపిన ఎంపీల్లో తొలి మూడు స్థానాల్లో.. రెండు స్థానాల్లోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలే ఉన్నారు.
రాజ్యసభలోని మొత్తం 225 మంది సభ్యుల ఆస్తుల విలువ 18వేల210 కోట్లు.వైసీపీ, బీఆర్ఎస్ లకు చెందిన 16 మంది ఎంపీల ఆస్తుల విలువలో వీరిద్దరి వాటా ఏకంగా 86 శాతంగా ఉంది. వారి తర్వాత స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ, అమితాబచ్చన్ భార్య జయభచ్చన్ వేయికోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. రాజ్యసభలో అతిపెద్ద పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన 115 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ 4వేల128 కోట్లు. కాగా బీఆర్ఎస్, వైసీపీ లకు చెందిన 16 మంది ఆస్తి విలువ ఏకంగా 9వేల157 కోట్లు. ఇందులో బీఆర్ఎస్ సభ్యుల మొత్తం ఆస్థి విలువ 5వేల596 కోట్లు..కాగా వైసీపీ ఎంపీల ఆస్తుల విలువ 3వేల561 కోట్లు అని ఏడీఆర్ సంస్థ తెలిపింది. ఎంపీల ఆస్తుల విలువలో రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఉత్తర ప్రదేశ్ ,పంజాబ్ , మహారాష్ట్ర ఉన్నాయి.