కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చిన రాష్ట్రీయ జనతాదళ్
పార్లమెంట్ న్యూ బిల్డింగ్ ఇనాగరేషన్ వేళ రాష్ట్రీయ జనతాదల్ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది;
కొత్త పార్లమెంట్ భవనం నమూనాను శవపేటికతో పోల్చింది రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ. యే క్యా హై అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. పార్లమెంట్ న్యూ బిల్డింగ్ ఇనాగరేషన్ వేళ రాష్ట్రీయ జనతాదల్ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. శవపేటికను పోలినట్లు కొత్త పార్లమెంట్ భవనం ఉందనే అర్థం వచ్చేలా ఉన్న ఈ పోస్ట్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాసేపటి క్రితం పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని విపక్షాలు బాయ్కాట్ చేసింది. సరైన ప్రణాళిక లేకుండా నిర్మాంచారంటూ మండిపడ్డాయి ప్రతిపక్షాలు. మరికొంత సమయం తీసుకొని నిర్మించి ఉంటే బాగుండేదని ప్రతిపక్షాలు అంటున్నాయి.