రాజస్థాన్లో ఇసుక తుఫాన్ భీభత్సం
భారీగా ఇసుక తుఫాన్ వస్తుండటంతో...జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఒక వ్యక్తికీ ఇంకో వ్యక్తి కనపడటం లేదు.
రాజస్థాన్లోని బికనీర్, జైసల్మేర్లను ఇసుక తుఫాన్ భీభత్సం సృష్టించింది. భారీగా ఇసుక తుఫాన్ వస్తుండటంతో...జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఒక వ్యక్తికీ ఇంకో వ్యక్తి కనపడటం లేదు. రోడ్లపైకి వాహనదారులు రావాలంటే... భయపడిపోతున్నారు. పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. పోఖ్రాన్, ఫాల్సూంద్, రామ్దేవ్రా, భైన్సడా తదితర ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. సోలార్ ప్యానెళ్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. విండ్ టర్బైన్లు సైతం విరిగిపడ్డాయి.