Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ మిస్టరీలో సంజయ్ వర్మను గుర్తించిన మేఘాలయ పోలీసులు

వీడిన 234 ఫోన్ కాల్స్ మిస్టరీ..;

Update: 2025-06-19 05:17 GMT

హనీమూన్ మర్డర్ కేసు వెనుక ఉన్న మిస్టరీని మేఘాలయ పోలీసులు ఒక్కొ్క్కటిగా ఛేదిస్తున్నారు. ఇక 243 ఫోన్ కాల్స్ వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది. సోనమ్.. సంజయ్ వర్మ అనే వ్యక్తి మధ్య మార్చి 1 నుంచి 25 వరకు దాదాపు 119 కాల్స్ నడిచాయి. ఇందుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే సంజయ్ వర్మ ఎవరనేది తెలుసుకునేందుకు సోనమ్ రఘువంశీ సోదరుడిని కలిసి పోలీసులు వాకబు చేశారు. అసలు సంజయ్ వర్మ అనే వ్యక్తే తనకు తెలియదని చెప్పాడు. దీంతో లోతుగా రికార్డులను పరిశీలించగా.. ప్రియుడు రాజ్ కుష్వాహాగా గుర్తించారు. సోనమ్.. తన మొబైల్‌లో ప్రియుడి పేరును సంజయ్ వర్మగా సేవ్ చేసుకుంది. దీంతో సంజయ్ వర్మ పేరుతో ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా తేల్చారు. మొత్తానికి వివాహానికి ముందు.. తర్వాత ఇద్దరి మధ్య 200 ఫోన్ కాల్స్ నడిచాయి.

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సోనమ్.. తన ప్రియుడి పేరును సంజయ్ వర్మగా సేవ్ చేసుకుందని మేఘాలయ పోలీసులు తెలిపారు. 39 రోజుల్లో ఇద్దరు కలిసి 239 సార్లు కాల్స్ మాట్లాడుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సంజయ్ వర్మ మొబైల్ నెంబర్ స్విచ్ఛాఫ్‌లో ఉందని పేర్కొన్నారు. ఇక నిందితులకు సోనమ్ బంధువు జితేంద్ర యూపీఐ నుంచి నగదు చెల్లించారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే సోనమ్‌తో తన కుటుంబానికి అన్ని సంబంధాలు తెగిపోయాయని గోవింద్ తెలిపాడు. ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తానని సోనమ్ సోదరుడు గోవింద్ చెప్పాడు.

ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీతో యూపీకి చెందిన సోనమ్‌తో మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. అనంతరం మే 23న జంట అదృశ్యమైంది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జూన్ 2న రాజా మృతదేహం లభించింది. దీంతో అతడు హత్యకు గురైనట్లుగా తేల్చారు. అనంతరం భార్య సోనమ్ కోసం గాలిస్తుండగా అకస్మాత్తుగా జూన్ 8న ఘాజీపూర్‌లో ప్రత్యక్షమైంది. అనంతరం సోనమ్‌ను అదుపులోకి తీసుకోగా నేరాన్ని అంగీకరించింది. ముగ్గురు హంతక ముఠా సహా ప్రియుడు రాజ్ కుష్వాహాను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News