Jammu and Kashmir: ఉధంపుర్‌లో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు పోలీసుల మృతి

పోలీసుల బాడీల్లో బుల్లెట్లు

Update: 2024-12-08 05:00 GMT

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ లో ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లాలో ఆదివారం ఉదయం ఇద్దరు పోలీసులు బుల్లెట్ గాయాలతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పరస్పర విబేధాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని కాళీమాత ఆలయం వెలుపల పోలీసు వ్యాన్‌లో బుల్లెట్‌లతో కూడిన మృతదేహాలు పడి ఉన్నాయని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకొని మరణించినట్లు ప్రాథమిక నివేదికలో తేలిందని అధికారి తెలిపారు. ప్రస్తుతం వివరాలు కోసం వేచి ఉన్నాయి.

ఎస్‌ఎస్‌పీ ఉధంపూర్ అమోద్ నాగ్‌పురే మాట్లాడుతూ.. రహమ్‌బాల్ ప్రాంతంలో ఇద్దరు పోలీసులు ఒకరినొకరు కాల్చుకుని మృతి చెందారు. ఉదయం 6.30 గంటలకు ఘటన చోటు చేసుకుంది. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ ఘటనలో ఎకే-47 రైఫిల్‌ను ఉపయోగించినట్లు రుజువైంది. అక్కడే ఉన్న మూడో పోలీసు సురక్షితంగా ఉన్నారు. పోస్ట్‌మార్టం, ఇతర ప్రక్రియల కోసం ఉధంపూర్‌కు తరలించారు.

Similar News