మ్యూజియం చూడడానికి వచ్చి చోరీకి యత్నించి.. దొరికిపోయిన దొంగ

భోపాల్ మ్యూజియం నుండి కళాఖండాలను దొంగిలించడానికి ప్రయత్నించిన వ్యక్తి, 25 అడుగుల గోడ ఎక్కుతుండగా పడిపోయాడు.;

Update: 2024-09-04 06:59 GMT

ఒక వ్యక్తి మధ్యప్రదేశ్ స్టేట్ మ్యూజియంలో గుప్తుల కాలం నుండి మొఘల్ కాలం వరకు ఉన్న 200 కంటే ఎక్కువ నాణేలను, ఇతర కళాఖండాలను దొంగిలించాడు. అనంతరం అక్కడి నుంచి బయటపడేందుకు మ్యూజియం యొక్క 25 అడుగుల గోడను ఎక్కడంలో విఫలమై అక్కడే గాయలతో పడిపోయాడని పోలీసులు తెలిపారు. 

భోపాల్‌లోని స్టేట్ మ్యూజియంలో సుమారు 15 కోట్ల రూపాయల విలువైన కళాఖండాలను దొంగిలించడానికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్ యాదవ్ అనే నిందితుడు సెప్టెంబర్ 1న (ఆదివారం) టిక్కెట్ కొనుగోలు చేసి మ్యూజియంలోకి ప్రవేశించి సాయంత్రం మ్యూజియం మూసేయడంతో మెట్ల వెనుక దాక్కున్నాడు.

మ్యూజియం మూసివేసిన తరువాత అక్కడ ఉన్న విలువైన వస్తువులను, నాణేలను సర్ధుకున్నాడు. కానీ అతడి ప్రయత్నం ఫలించలేదు. తప్పించుకునే క్రమంలో గోడ ఎక్కి విఫలమై గాయాలపాలై పోలీసుల చేతికి చిక్కాడు. 

మంగళవారం, మ్యూజియం అధికారులు పగిలిన తాళాలు, బంగారు, వెండి కళాఖండాలు, నాణేలను కలిగి ఉన్న ఖాళీ పెట్టెలను కనుగొనడంతో పోలీసులను అప్రమత్తం చేశారు.

పోలీసులు మ్యూజియం వద్దకు చేరుకుని సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో నిందితుడు మ్యూజియం గోడకు సమీపంలో గాయపడి పడి ఉన్నాడని గుర్తించి పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

అతని నుండి 98 బంగారు మరియు లోహ నాణేలు, 75 వెండి నాణేలు, 38 రాగి నాణేలు, ఒక బంగారు పతకం,12 మిశ్రమ లోహ పతకాలు ఉన్న ఒక బ్యాగ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం 15 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 

ఈ ఘటనపై భోపాల్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రియాజ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. మ్యూజియం భద్రతా ఏర్పాట్లు నాసిరకంగా ఉన్నాయని అన్నారు. 

సెక్యూరిటీ అలారం, సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని, ఎంట్రీ డోర్లు బలహీనంగా ఉన్నాయని, బలమైన పుష్‌తో తెరుచుకోవచ్చని తెలిపారు. కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News