Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్..

ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు మృతి;

Update: 2025-04-16 03:00 GMT

ఛత్తీస్‌గఢ్‌‌లో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కొండగావ్-నారాయణ్‌పూర్ సరిహద్దులో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్ట్ అగ్ర నేతలను భద్రతా దళాలు హతమార్చాయి. సంఘటనాస్థలి నుంచి ఏకే 47 తుపాకులతో పాటు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను మావోయిస్టు అగ్రనేతలుగా గుర్తించారు. వారి గురించి వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బస్తర్ ఐజీ పి.సుందరరాజ్ తెలిపారు. మరిన్ని వివరాలు అందాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇదిలా ఉంటే మంగళవారం తెల్లవారుజామున అంబాగఢ్ చౌకీ జిల్లాలో 5 లక్షల రివార్డు ఉన్న ఒక నక్సలైట్ భద్రతా దళాల ముందు లొంగిపోయాడు. 34 ఏళ్ల రూపేష్ మాండవి అలియాస్ సుఖ్‌దేవ్ జిల్లాలోని సీనియర్ పోలీసు అధికారుల ముందు లొంగిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News