Monsoon Session 2023: లోక్సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిత్యానందరాయ్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళన;
ఢిల్లీ సర్వీసెస్ బిల్లును లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించి గతంలో కేంద్రం ఆర్డినెన్స్ కూడా తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ను చట్టం చేయడం కోసం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర సర్కార్. ఈ ఢిల్లీ సర్వీసెస్ బిల్లును అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిట్ల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ 2023గా పరగణిస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా తరపున కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరీ వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ఈ బిల్లు ఢిల్లీ ప్రభుత్వ హక్కులను కాలరాసే ప్రయత్నమన్నారు. ఇది సుప్రీంకోర్టు గత తీర్పులకు విరుద్ధమని తెలిపారు.
ఢిల్లీకి సంబంధించిన ఏ చట్టాన్నైనా రూపొందించే అధికారాన్ని లోక్సభకు రాజ్యాంగం కల్పించిందంటోంది కేంద్రం. చట్టాన్ని తీసుకొచ్చే అధికారం కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టం చేసిందని బీజేపీ సర్కార్ చెబుతోంది. రాజకీయ దురుద్దేశంతోనే ఢిల్లీ ప్రభుత్వం బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని.. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు అనుమతించాలని స్పీకర్ను కోరింది. అయితే ఈ బిల్లును తీసుకురావడాన్ని సమాఖ్య విధానంపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణించింది. ఇక ఇవాళ ఢిల్లీపై దాడి జరుగుతోందని.. రేపు ఏ రాష్ట్రంపైనా అయినా జరగొచ్చని విపక్షాలు ఆందోళన చేశాయి.