YEAR END: భారత చరిత్రలో నిర్ణయాత్మక అధ్యాయం

2025 భా­ర­త­దేశ అభి­వృ­ద్ధి ప్ర­యా­ణం­లో ఒక ని­ర్ణ­యా­త్మక అధ్యా­యం­

Update: 2025-12-27 12:00 GMT

2025 భా­ర­త­దేశ అభి­వృ­ద్ధి ప్ర­యా­ణం­లో ఒక ని­ర్ణ­యా­త్మక అధ్యా­యం­గా ని­లి­చిం­ది. రైలు, రో­డ్డు, వి­మా­న­యా­నం, సము­ద్ర మా­ర్గం, డి­జి­ట­ల్ మౌ­లిక సదు­పా­యా­ల­లో ప్ర­తి దశ­లో­నూ ఈ సం­వ­త్స­రం భా­ర­త­దేశ అభి­లా­ష­లు వా­స్త­వి­క­త­గా మా­రా­యి. దే­శం­లో­ని అత్యంత దూర ప్రాం­తాల నుం­చి పె­ద్ద నగర కేం­ద్రాల వరకు కనె­క్టి­వి­టీ లో­తు­గా పె­రి­గిం­ది, దూ­రా­లు తగ్గా­యి, ప్ర­జల ఆకాం­క్ష­ల­కు ఇసుక, సి­మెం­ట్, రైలు పట్టా­లు ఆధా­ర­మ­య్యా­యి. ఆర్థిక సం­వ­త్స­రం 2025-26లో ప్ర­భు­త్వం మౌ­లిక సదు­పా­యాల కోసం రూ. 11.21 లక్షల కో­ట్ల మూ­ల­ధన వ్య­యా­న్ని కే­టా­యిం­చిం­ది, ఇది దేశ GDP­లో 3.1 శా­తా­ని­కి సమా­నం. అయి­తే 2047 వరకు భా­ర­త­దే­శం ప్ర­తి 12-18 నె­ల­ల­కు $1 ట్రి­లి­య­న్ GDP­ను జో­డిం­చే అం­చ­నా ఉంది. ఇది మౌ­లిక సదు­పా­యా­లు ఆర్థిక వృ­ద్ధి­కి గు­ణ­కా­రం­గా మా­రిం­ది. అలా­గే 2025 ఆ గు­ణం­కా­లు కని­పిం­చే ఫలి­తా­ల­ను ఇచ్చిం­ది.

రోడ్లు, హైవేల నిర్మాణం

రహ­దా­రుల ని­ర్మా­ణం­లో భా­ర­త్ సరి­కొ­త్త రి­కా­ర్డు­ల­ను నమో­దు చే­సిం­ది. ఆరే­ళ్ల­లో 14,000 కి­లో­మీ­ర­ట్ల­కు పైగా రహ­దా­రు­ల­ను ని­ర్మిం­చిం­ది. దే­శం­లో జా­తీయ రహ­దా­రుల నె­ట్‌­వ­ర్క్ పొ­డ­వు మా­ర్చి 2019లో 1,32,499 కి.మీ నుం­చి ప్ర­స్తు­తం 1,46,560 కి.మీకి పె­రి­గిం­ది. 4-లేన్, అం­త­కం­టే ఎక్కువ NH నె­ట్‌­వ­ర్క్ పొ­డ­వు 2019లో 31,066 కి.మీ నుం­చి 43,512 కి.మీకి 1.4 రె­ట్లు పె­రి­గిం­ది. ఇది అభివృద్ధి వేగాన్ని పెంచింది.

మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌

భారత్ ప్రపంచలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ నిలించింది. ఒక్క ఏడాదిలోనే దేశంలో 700 కిలో మీటర్లకుపై మెట్రో నెట్‌వర్క్‌ విస్తరించింది. 2014లో 248 కి.మీ నుంచి 2025లో 1,013 కి.మీకి పెరిగింది. భారత్ ఇప్పుడు ప్రపంచంలో మూడవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా గర్వంగా చెప్పుకుంటుంది. ఇది నగర ట్రాన్జిట్ విస్తరణలో తన వేగవంతమైన అడుగులను ప్రతిబింబిస్తుంది. మిజోరంలో మొదటిసారి జాతీయ రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానం చేసి చరిత్ర సృష్టించబడింది. మిజోరం చివరకు భారత జాతీయ రైల్వే నెట్‌వర్క్‌లో భాగమైంది, ఇది ఈశాన్య భారత్‌కు మార్పు ఒక మైలురాయిగా నిలిచింది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షలను నెరవేర్చింది. ఈ విజయంతో మిజోరం భారత రైల్వే మ్యాప్‌లో చేరింది. 51 కిలోమీటర్ల బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్, రూ.8,000 కోట్లకు పైగా ఖర్చుతో ప్రభుత్వం నిర్మించింది.

అయిజాల్‌ను స్వాతంత్ర్య భారత చరిత్రలో మొదటిసారి జాతీయ రైల్వే నెట్‌వర్క్‌కు నేరుగా అనుసంధానం చేసింది. అత్యవసర సేవలు, సైనిక లాజిస్టిక్స్, పౌర ఆరోగ్య సేవలు, విద్య, ఉపాధి అవకాశాలు – మిజోరం జనాభాకు ఒకే రైల్వే లైన్‌తో పూర్తిగా మార్పు చెందాయి.

దేశంలోనే తొలి ర్టికల్ లిఫ్ట్ సముద్ర బ్రిడ్జ్

2025లో భారత్ మౌలిక సదుపాయాల కథ సముద్రాలకు కూడా చేరింది. దేశంలోనే మొదటి సారిగా ప్రభుత్వం వర్టికల్ లిఫ్ట్ సముద్ర బ్రిడ్జ్ ను నిర్మించింది. ఇది సాంకేతిక పురోగతి, ప్రత్యేక డిజైన్‌లకు ప్రసిద్ధి చెందింది. అదునిక రామసేతుగా పిలువబడే ఈ పాంబన్‌ బ్రిడ్జ్‌ను రామనవమి సందర్భంగా ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.

Tags:    

Similar News