ఏపీలో ముస్లింల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర. రంజాన్ సందర్భంగా పొన్నూరులో ఆయన ముస్లింలకు రంజాన్ తోఫా కానుకలు అందజేశారు. వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు పెరిగిపోయాయని ధూళిపాళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇమామ్లకు ఇచ్చే గౌరవ వేతనాలు నిలిపేశారని.. మైనార్టీలపై దాడుల కారణంగా కర్నూలులో ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసిందన్నారు.