తల్లి పాలే బిడ్డకు ఆహారం, అమృతం, వైద్యం లాంటివి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పిల్లల ఆరోగ్యమే తల్లులకు మహాభాగ్యమన్నారు. హైదరాబాద్ అంబ ర్పేట్ నియోజకవర్గంలోని బాగ్ అంబర్పేటలో హెల్తీ బేబీ షో కార్యక్రమంలో పా ల్గొన్నారు. దేశంలోని ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో హెల్తీ బేబీషో కార్యక్ర మం నిర్వ హించాలని మోదీ ఆదేశించినట్లు చెప్పారు. 3 నుంచి 13 నెలల పసి పిల్లలతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భేటీ బచావ్ భేటీ పఢావ్లో భాగంగా బాలికల ఆరోగ్యంతోపాటు భ్రుణహత్యలను తగ్గించారని.. దీంతో మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లల సగటు పెరిగిందని వెల్లడించారు.