నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఘటన బాధాకరమన్నారు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్. ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ను తమ సిబ్బంది వీల్ఛైర్లో వెయిటింగ్ ఏరియాలో కూర్చోబెట్టారని చెప్పారు. పది నిమిషాల వ్యవధిలోనే వారి కుటుంబ సభ్యులు లాక్కెళ్లారని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో వీల్ఛైర్స్, స్ట్రెచర్స్ కొరత లేదని పేర్కొన్నారు. వీడియో తీసి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని.. దీని వల్ల సిబ్బంది, వైద్యుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందంటున్నారు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్.