అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శబరిమల సమీపంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. శబరిమల దగ్గరలోని కొట్టాయం దగ్గర ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు ప్రధాని మో దీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రభుత్వం విమా న ప్రయాణాన్ని ప్రజాస్వామ్యీకరించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. త ద్వారా మధ్యతరగతి వారు తక్కువ ఖర్చుతో కూడిన విమాన ప్రయాణాన్ని పొం దగలరంటూ కిషన్ రెడ్డి వివరించారు. దాదాపు 150 ఆపరేషనల్ ఎయిర్పోర్టులు ఉన్నాయని.. వాటిలో సగం 2014 తర్వాత ప్రారంభించినట్లు తెలిపారు.