వైఎస్ వివేకా హత్య కేసుపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.. నాలుగేళ్ల తర్వాత సీబీఐ వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిందన్నారు.. పదేపదే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్షాను ప్రాధేయపడటంతోనే కేసు నెమ్మదించిందన్నారు.. ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పిన మాటలను సీపీఐ రామకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు.. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.