ఛత్తీస్ఘడ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఐరన్ ఓర్ కోసం వెళ్తున్న లారీని తగులబెట్టారు. పరస్గావ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓర్చ వద్ద జరిగిన ఘటనను నారాయణపూర్ జిల్లా ఎస్పీ పుష్కర శర్మ ధృవీకరించారు. ఐరన్ మైన్ లోడ్ కోసం చోటే నగర్ వెళ్తున్న లారీని మావోయిస్టులు తగులబెట్టారని తెలిపారు.