సిద్దిపేటలో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ
కేసీఆర్ను తిట్టడం కొందరికి ఫ్యాషన్గా మారింది..;
ప్రశ్నిస్తే ఈడీ, ఐటీ కేసులు పెడుతున్నారంటూ మంత్రి హరీష్రావు కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కేసులకు భయపడే నాయకుడు కాదని స్పష్టం చేశారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో పాల్గొన్న హరీష్రావు... మోదీకి తెలంగాణపై ప్రేమ లేదన్నారు. కేసీఆర్ను తిట్టడం కొందరికి ఫ్యాషన్గా మారిందని.. ఆయనను తిట్టడం వల్ల పెద్దోళ్లు అయిపోరన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు హరీష్రావు.