మీ నోటి దురదకు సారీ చెప్పాల్సిందే: చంద్రబాబు

రజినీకాంత్ పై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్

Update: 2023-05-01 08:28 GMT

హీరో రజనీకాంత్‌పై వైసీపీ నేత విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. విజయవాడ పర్యటనలో జగన్ ప్రభుత్వంపై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైసీపీ నేతలు చేసిన నీచపు వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్.. తన అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ మూకల అసభ్యకర దాడిని ఖండిస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


Tags:    

Similar News