కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొంది. అప్రమత్తమైన పెలెట్లు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ జక్కూర్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరింది. కోలార్ సమీపంలోని ముల్బాగిలు మార్గంలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలోని హోస్కోట్ సమీపంలో గాలిలో ఒక డేగ హెలికాప్టర్ ను ఢీకొనగా.. విండ్షీల్డ్ అద్దం పగిలిపోయింది.