హైదరాబాద్ ఉప్పల్ క్రాస్ రోడ్డులో పాదచారుల కష్టాలు తీరనున్నాయి. 25 కోట్ల రూపాయలతో హెచ్ఎమ్డీఏ స్కై వాక్ను ఏర్పాటు చేసింది. స్కైక్ వాక్ ఎక్కేందుకు దిగేందుకు వీలుగా ఆరు చోట్ల ఎస్కలేటర్స్, లిఫ్టులు ఏర్పాటు చేశారు. నేరుగా ఉప్పల్ మెట్రో స్టేషన్లోకి వెళ్లేందుకు వీలుగా స్కై వాక్ను నిర్మించారు. ప్రారంభానికి ఉప్పల్ స్కై వాక్ నిర్మాణంపై సిద్ధమవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.