ఒక్కసారిగా ఊపందుకున్న పోలింగ్
కర్ణాటకలో కిటకిటలాడుతోన్న పోలింగ్ కేంద్రాలు;
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మందకోడిగా సాగిన పోలింగ్.. ఆ తరువాత ఒక్కసారిగా పెరిగింది. ఓటర్లంతా పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు. దీంతో పోలింగ్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఓటు వేసేందుకు జనం పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ కట్టారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 52.12శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మైసూరులో మధ్నాహ్నం 3గంటల వరకు 52.4 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక బెంగళూరు సిటీ 41.3శాతం, బెంగళూరు గ్రామీణం 60.1శాతం పోలింగ్ నమోదైంది.