వారిని చర్చలకు పిలిచేది లేదు: సీఎస్ శాంతకుమారి

జేపీఎస్ సమ్మెపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Update: 2023-05-13 06:30 GMT

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేపీఎస్‌లను చర్చలకు పిలిచేది లేదని సీఎస్ శాంతకుమారి తెలిపారు. విధుల్లో ఉన్నవారి జాబితాను మధ్యాహ్నం 12 గంటల లోపు పంపాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జేపీఎస్‌లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని.. లేకుంటే సమ్మె విరమించని వారితో ఇక ఎలాంటి సంబంధం ఉండదని హెచ్చరించారు. విధులకు హాజరు కాని వారి స్థానంలో తాత్కాలిక కార్యదర్శులను నియమించాలని సూచించారు.


Tags:    

Similar News