అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. కుడేరు మండలం ఉదిరిపి కొండకు చెందిన ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఊరికి చెందిన వీనిషా, వెంకట్నాయుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో మనస్థాపం చెంది మదనపల్లి లోని ఓ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు అంటున్నారు.