నిజామాబాద్ మార్కెట్లో ఆమ్చూర్ తయారు చేసే రైతు దగా పడుతున్నాడు. తెలంగాణలో ఏకైక నిజామాబద్ మార్కెట్లో క్వింటాకు అత్యధికంగా 20వేలు దాటడం లేదని రైతులు వాపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మామిడి ఆమ్ చూర్కు మంచి డిమాండ్ ఉంది. పంట సాగు చేసి, ఆమ్ చూర్ తయారు చేసే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు, ఆమ్చూర్ నాణ్యత లేదంటూ వ్యాపారులు కొర్రీలు పెడుతున్నారని అంటున్నారు రైతులు.