మహబూబాబాద్ జిల్లాలో గార్ల మండలం కృష్ణాపురంలో సౌజన్య అనే పాప కంట్లో నుంచి వివిధ పదార్థాలు బయటకు రావడం సంచలనం రేపుతోంది. గత పది రోజులుగా పాప కుడి కన్నులోంచి ప్లాస్టిక్, ఇనుము, పేపర్ ముక్కలు, బియ్యపు గింజలు జారిపడుతున్నాయి. దాంతో చిన్నారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పాపను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.