కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్రావు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని అన్నారు. ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాలకంటే ప్రమాద కరంగా తయారయ్యాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సభలకు కిరాయి మనుషులను తరలిస్తున్నారని అన్నారు. విపక్షాలకు 40 చోట్ల అభ్యర్థులు కూడా లేరన్నారు. బీజేపీ నేతలకు డిపాజిట్ల రావన్న భయం పట్టుకుందన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మెళనంలో హరీశ్రావు పాల్గొన్నారు.