అభివృద్ధే లక్ష్యంగా తొలి మ్యానిఫెస్టో

Update: 2023-05-28 09:57 GMT

తెలుగుదేశం పార్టీ మహానాడుతో రాజమండ్రి పసుపుమయమైంది. వేమగిరి జనసునామీని తలపిస్తోంది. ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపిస్తోంది. కాసేపట్లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు 15 లక్షల మంది కార్యకర్తలు వస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. 120 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సర్వం సిద్ధం చేశారు. బహిరంగ సభావేదిక నుంచే టీడీపీ తొలి మ్యానిఫెస్టోను చంద్రబాబు ప్రకటించబోతున్నారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తొలి మ్యానిఫెస్టోకు రూపకల్పన చేశారు..

Similar News