దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఇందుకుగాను సీఎం కేసీఆర్ కు లెటర్ రాశారు. ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్ చేసిన భూములను లాక్కుంటూ రియల్ వ్యాపారం చేయడం దుర్మార్గమని అన్నారు. దళితులను, గిరిజనులు బీఆర్ఎస్ మోసం చేస్తుందన్నారు. గిరిజనుల భూములను గుంజుకుంటారా? దళిత, గిరిజనులంటే మీకెందుకు అంత కక్ష? అసైన్డ్ భూముల్లో రియల్ దందాకు తెరదించకుంటే బిజెపి తెలంగాణ శాఖ పక్షాన పెద్దఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు.