మంత్రి KTR అమెరికా పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. బెయిన్ క్యాపిటల్ గ్రూప్నకు చెందిన వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్ లో సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిద్వారా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. అదేవిధంగా టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మండీ హోల్డింగ్స్ సంస్థ ప్రకటించింది. దీనిద్వారా 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.