తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి. వ్యవసాయాన్ని పండగలా చేయాలన్న నినాదంతో, సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ, దశాబ్ధి ఉత్సవాల్లో, మొట్టమెదటి రోజు రైతు దినోత్సవాన్ని జరుపుకున్నామన్నారు శాంత కుమారి. అకాల వర్షాలు వడగళ్ల వాన నుండి పంట నష్టపడకుండా, ఉండాలంటే రైతులు రెండు మూడు వారాల ముందే నార్లు వేయాలన్నారు. ఎరువులను దఫ దపాలుగా వాడితే అధిక దిగుబడి వస్తుందన్నారు శాంత కుమారి.