తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. పిట్టగోడను టాటా సుమో వాహనం ఢీకొట్టింది. 32వ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ బెంగుళూరుకు చెందిన నలుగురు భక్తులను తిరుపతి స్విమ్స్కు తరలించారు