సీఎం జగన్ అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్. R5 జోన్ అంశంలో అమరావతి రైతులకు నిరాశ మిగిలినా.. ఇది తాత్కాలికమే అన్నారు. పేదలపై జగన్ ప్రేమ దృతరాష్ట్ర కౌగిలి లాంటిదని విమర్శించారు. సుప్రీంకోర్టులో R5 జోన్ పై క్లారిటీ రాగానే, ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి వేగం పెంచిందన్నారు. భూములిచ్చిన రైతులపై జగన్ ప్రభుత్వం లాఠీ జులిపించిందని మండిపడ్డారు.