జగనన్న కాలనీల పేరుతో విచ్చలవిడిగా అక్రమాలు

Update: 2023-08-07 06:04 GMT

జగనన్న కాలనీల పేరుతో ఏపీలో యధేచ్చగా అక్రమాలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో వైసీపీ నేతల చేతివాటానికి ఓ మహిళా రైతు నిండా మునిగింది. వెంకన్నపాలెంకు చెందిన మహాలక్ష్మి జగనన్న కాలనీ కోసం తన 10 సెంట్ల భూమిని ఇచ్చింది. అయితే పరిహారంగా సుమారు 72లక్షలను  ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆ నగదు వైసీపీ నేతల ఖాతాల్లో జమకావడంతో మహాలక్ష్మి కంగుతున్నారు. తనకు న్యాయం చేయాలని రెండేళ్లుగా పోరాటం చేస్తున్న పట్టించుకునే నాధుడే లేడని కన్నీరుమున్నీరువుతున్నారు.  

Tags:    

Similar News