తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నేత ఏ. చంద్రశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు.బీజేపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు.తెలంగాణ సర్కార్ అన్యాయాలను కేంద్ర అడ్డుకోవడంలేదంటూ లేఖలో పేర్కొన్నారు.అయితే అయన కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.ఈ నెల 18న ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపారు. వికారాబాద్ నియోజక వర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రశేఖర్.