తిరుమలలో చిరుతలను బంధించేందుకు తయారు చేయించిన కొత్త బోనులు తిరుమల చేరుకున్నాయి. సరికొత్త టెక్నాలజీ తో తయారు చేసిన ఈ బోనులను మహారాష్ట్ర నుంచి తెప్పించింది అటవీశాఖ. చిరుత కదలికలను బట్టి ఈ బోన్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసి కెమెరా ట్రాప్స్తో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు.