తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల టీమ్ను కూడా సిద్ధం చేసింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాని ఒక ఇన్ఛార్జ్ను నియమించింది. పూర్తి స్థాయి ప్రచార కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. ప్రచార కమిటీ ఛైర్మన్గా మధు యాష్కీ, కోఛైర్మన్గా పొంగులేటి... కమిటీ మెంబర్గా జెట్టి కుసుమ కుమార్ను నియమించింది. తెలంగాణలో వరుసగా రాహుల్, ప్రియాంక గాంధీ సభలకు ప్లాన్ చేసింది. ఈనెల 20న కొల్లాపూర్లో ప్రియాంకా గాంధీ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొల్లాపూర్ బహిరంగ సభలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది.