సైబరాబాద్ SOT పోలీసులు భారీగా నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 85 లక్షల విలువైన 2.65 టన్నుల నకిలీ పత్తి విత్తనాలతో పాటూ, ఏడుగురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం BG-3 HT విత్తనాలను బ్యాన్ చేసిందని నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి రైతులు నష్టపోతున్నారని, విత్తనాలు కొనుగోలు చేసే ముందు ప్యాకింగ్ పై అన్ని వివరాలు తప్పక చూడాలి అని సీపీ తెలిపారు.