తిరుపతి గంగమ్మ తల్లి లక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. 20 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు భక్తులు. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరస్వామి చెల్లెలుగా విరాజిల్లుతున్న తిరుపతి గంగమ్మతల్లి జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జాతర ముగిసిన తర్వాత నాలుగో మంగళవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు వివిధ వేషధారణలతో గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారి సేవలో తరిస్తున్నారు.