కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీజేపీ కేడర్కు పిలుపునిచ్చారు బీజేపీ నేత ఈటల రాజేందర్.బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం మూడేళ్లుగా సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలన్నారు. కొందరు కావాలనే బీజేపీపై దుష్ర్పచారం చేస్తున్నారన్న ఈటల..వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు.