వరంగల్ జిల్లాలో గవర్నర్ పర్యటించారు. హన్మకొండ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన గవర్నర్ బాధితులను పరామర్శించారు.వారికి రెడ్ క్రాస్ తరపున నిత్యావసర సరుకులు అందజేశారు.అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.మరోసారి వరదలు వస్తే తట్టుకునేలా వరంగల్ నగరంలో శాశ్విత నిర్మాణాలు చేపట్టాలని అన్నారు.నివేదికల ఆధారంగా కేంద్రం స్పందిస్తుంద్న గవర్నర్ సాయం కోసం కేంద్రానికి లేఖ రాస్తానని అన్నారు.