Gunadala Churchu: నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు

ఘనంగా నూరు వసంతాల ఉత్సవాలు

Update: 2024-02-09 06:15 GMT

 విజయవాడలోని గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర నూరు వసంతాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను విజయవాడ కథోలిక పీఠాధిపతి బిషప్ జోసఫ్ రాజారావు సమష్టి దివ్య పూజాబలితో ప్రారంభించారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేశామని బిషప్ రాజారావు తెలిపారు. ఈ వేడుకలలో వాటికన్ రాయబారి లియోపోల్డో జిరెల్లి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. 1924 ఏడాదిలో బ్రిటిష్ ప్రభుత్వం గుణదలలో సెయింట్ జోసఫ్స్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. అక్కడ గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. కాలక్రమంలో ఈ క్షేత్రం జనాదరణ పొందడంతో ప్రతి ఏటా ఫిబ్రవరిలో అక్కడ మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

Tags:    

Similar News