పట్టిసీమపై జగన్ సర్కార్ యూ టర్న్ తీసుకుంది.గోదావరి నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నా..ఇన్నాళ్లూ చోద్యం చూసిన వైసీపీ సర్కార్ విధిలేని పరిస్థితుల్లో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణకు తరలించింది.ఈ సీజన్లో దాదాపు 1,400 టీఎంసీల గోదావరి జలాలు వృథా అయినా పట్టించుకోకుండా కోట్ల ప్రజాధనం వృథా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు పట్టిసీమను వాడటం అనివార్యమంటూ మోటర్లను ఆన్ చేసింది. శనివారం పట్టిసీమ నుంచి రెండు టీఎంసీలకుపైగా నీటిని వదిలింది.