పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్లో ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన..వృద్ధురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని వైసీపీ అరాచకాలను కేంద్రం దృస్టికి తీసుకువెళుతామన్నారు పవన్. ఉత్తరాంధ్రను జగన్ దోచేస్తున్నారని విశాఖలో ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారని మండిపడ్డారు చట్టాలను కాపాడాల్సిన సీఎం అతిక్రమిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.